ఖమ్మం : నగరంలో బైపాస్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలో భారత మాజీ ఉప ప్రధాని బాబుజగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు . భారత రిపబ్లిక్ తొలి లోక్సభ 1952వ సంవత్సరంలో ప్రవేశించి , వరుసగా ఎనిమిదిసార్లు గెలిచి , కేంద్రమంత్రిగా , దేశ ఉప ప్రధానిగా , దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ కేఎంసీ అధ్యక్షులు , స్టేట్ సెక్రటరీ ముత్యాల ఫణీంద్ర , ట్రెజరర్ మాడుగుల శ్రీనివాస్ , సభ్యురాలు గణేష్ జ్యోతి , ఆర్గనైజింగ్ సెక్రటరీలు మెట్టు కిరణ్ , గోల్లమందల నాగేశ్వరరావు , చిరంజీవి , అశోక్ , చిక్కుల నాని , బండారు రామకృష్ణ , ప్రభాకర్ , యాదగిరి , యాసిన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: