మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను వంకాయల వసంత 18000,సోడే వసంత 18000 రూపాయల విలువ గల చెక్కులను వారి ఇంటి వద్దకు వెళ్లి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సున్నం రాంబాబు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్ల రెడ్డి,సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,చిలక వెంకటరమయ్య ఎంపీటీసీ ఎనిక రవి, ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకట్రమణ,మండల మైనార్టీ అధ్యక్షులు నయుమ్,నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ,జగ్గారం గ్రామ శాఖ అధ్యక్షుడు సోడే నవీన్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు మల్లె బోయిన ప్రశాంత్, ఉపాధ్యక్షులు గజ్జి లోహిత్ , యువజన నాయకులు మహేష్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: