CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జర్నలిస్టుల వాహనాలపై ప్రెస్ స్టిక్కర్ల తొలగింపును నిలిపి వేయాలి. - హోం మంత్రి, డీజీపీ, ట్రాఫిక్ జేసీలకు టీడబ్ల్యూజేఎఫ్ వినతి.

Share it:

 



జర్నలిస్టుల వాహనాలపై ఉండే ప్రెస్ స్టిక్కర్ ను పోలీసులు తొలగించడం నిలిపివేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్యలతో కూడిన ప్రతినిధి బృందం హోం మంత్రి మహమూద్ అలీ,డిజీపీ మహేందర్ రెడ్డి, జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ రంగనాథ్ లను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. 

జంట నగరాల్లో ఇటీవల పోలీసులు ప్రెస్ స్టిక్కర్స్ పై జర్నలిస్టులకు చలాన్ విధిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ, ప్రెస్ నాలుగు స్తంభాలన్న విషయం తమరికి తెలుసనీ, జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న సమాజంలో సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకురావడానికి కీలకమైన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని వారు పేర్కొన్నారు.

హదేశంలో ఫోర్త్ ఎస్టేట్‌లకు రాజ్యాంగం సొంత గుర్తింపును కల్పిస్తుందని, ఇందులో భాగంగా పాత్రికేయులు తమ వాహనాలకు ప్రెస్ అనే స్టిక్కర్ పెట్టుకోవడం వారి వృత్తి నైతికతకు, ఉన్నత ప్రమాణాలకు గౌరవంగా భావిస్తారని అన్నారు. అయితే ఈ మధ్య పోలీసు అధికారులు జర్నలిస్టుల వాహనాలపై "ప్రెస్" అనే నేమ్ ప్లేట్‌ను తొలగించి అవమానపరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులు ఈ ప్రెస్ స్టిక్కర్ ను వాహనాలకు పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో వర్కింగ్ జర్నలిస్టులను పోలీసులు ఇబ్బంది పెట్టడం సరైంది కాదని,నకిలీ జర్నలిస్టులను తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, కానీ ఆ పేరుతో ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న నిజమైన జర్నలిస్టులను అనుమానించడం, అవమానించడం చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. దీనిపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ... విషయం పోలీస్ అధికారులతో మాట్లాడి నిజమైన జర్నలిస్టులకు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ... నకిలీ జర్నలిస్టులను ఏరివేత కోసమే వాహనాలపై ప్రెస్ స్టిక్కర్ల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని చెప్పారు. అక్రెడిటేషన్ కార్డు, గుర్తింపు పొందిన మీడియా సంస్థల ఐడీ కార్డు ఉండాలని అన్నారు. జర్నలిస్టులు కానివారంతా తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్స్ ను వెంటనే స్వచ్చందంగా తొలగించుకోవాలని రంగనాథ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవపున్నయ్యతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. ఆనందం, కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు, విజయానంద రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: