మన్యం టివి దుమ్ముగూడెం::
బండారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో నాల్గవ విడతగా పాఠశాల విద్యార్థులకు ఆభయం ఫౌండేషన్ హైద్రాబాద్ వారిచే గురువారంనాడు పిల్లలకు బూట్లు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ కాటిబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు ప్రతిఏటా బూట్లు పంపిణీ చేయటం అభినందనీయమని అభయం ఫౌండేషన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ కుంజా నాగేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ప్రతి ఏటా గిరిజన పిల్లలకు ఆభయం ఫౌండేషన్ సహాయ సహకారాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి. వంశీమోహన్, ఎం. సరోజిని ఆయా తిరుపతమ్మ పాల్గొన్నారు.
Post A Comment: