మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు 115 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, దళిత తొలి ఉప ప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం, అని అన్నారు.సమసమాజ స్థాపనకు కృషి చేసిన కృషివలుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన అన్నారు.ఆ మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని అనగారిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి కాళిక టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, బూర్గంపాడు మార్కెటింగ్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, సర్పంచులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: