మహబూబాబాద్:-ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మహబూబాబాద్లో తెరాస చేపట్టిన రైతు దీక్షలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.
మంత్రి సత్యవతి రాథోడ్ ఎదుటే ఈ విభేదాలు బయటపడటం గమనార్హం.
రైతు దీక్షలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతుండగా.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్యలోనే మైకు లాక్కున్నారు.
దీంతో ఎంపీ కవిత బిత్తరపోయారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన అనగానే.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కల్పించుకొని ‘అలా కాదు.. పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన అనాలి’ అని మంత్రికి సూచించారు.
Post A Comment: