మన్యం మనుగడ మంగపేట.
ఎక్కటి సరోజని శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల,మంగపేటకు అడిగిన వెంటనే ప్రహారి గోడను మంజూరు చేసి కళాశాల అభివృద్ధికి సహకరించిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు కళాశాల ప్రధానాచార్యులు గూళ్ల వెంకటయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కళాశాలకు పూర్తి స్థాయిలో ప్రహారి గోడ లేక పోవడం వలన రక్షణ లేక పశువులతో ఇబ్బంది ఉండేదని, ఈ విషయములో కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులతో కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకు వెళ్లగా ఆయన తక్షణం స్పందించి ప్రహరి గోడను మంజూరు చేశారని అన్నారు. ప్రస్తుతం ప్రహారి గోడ నిర్మాణం పూర్తయిందని కలెక్టర్ చొరవతోనే కలాశాలకు పూర్తి స్థాయి రక్షణ ఏర్పడిందని అన్నారు. ప్రహారి గోడ నిర్మాణం పట్ల ప్రధానాచార్యులు గూళ్ళ వెంకటయ్య, అధ్యాపక బృందము, విద్యార్థులు హర్షము వ్యక్తం చేశారు.
Post A Comment: