మన్యం మనుగడ కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జన్మదిన వేడుకలను ఈరోజు కరకగూడెం మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో పార్టీ నాయకులు పఠాన్ యాకుబ్ ఖాన్ ఆధ్వర్యంలో పద్మాపురం గ్రామంలో ముస్లిం నాయకులతో కలిసి కేక్ కట్ చేసి,మిఠాయిలు పంచిపెడుతూ జన్మదిన వేడుకలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాకుబ్ ఖాన్ మాట్లాడుతూ నిజాయితీ, నిజాయితీకి అంకితభావానికి,అభివృద్ధికి మారుపేరు రేగా కాంతారావు సార్ అని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకమైన విజన్ ఉన్న ఓ గొప్ప నాయకుడని పేర్కొన్నారు.రేగా కాంతారావు పాలనలో పినపాక నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: