CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అధైర్య పడకండి అండగా ఉంటా.పలువురు కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు*.

Share it:


మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని బర్లగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన. నరసింహారావు(45) సంవత్సరాలు గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పది వేల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే మండల పరిధిలోని బంగారుగూడెం గ్రామానికి చెందిన జనం విలేఖరి పూనెం. విష్ణు మూర్తి ఇటీవల కాలంలో తన ద్విచక్రవాహనంపై కింద పడటంతో బలమైన గాయాలై హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్న విష్ణుమూర్తిని పరామర్శించి రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వేల రూపాయల చెక్కును అందజేశారు అనంతరం అదే గ్రామానికి చెందిన బంగారి రామయ్య ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడడంతో వారి నివాసానికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొని పదివేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల,సోమయ్య, రఘునాధపాలెం సర్పంచ్ పోలెబోయిన. నరసింహారావు కన్నాయిగూడెం సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లేటి భవానిశంకర్,వట్టం రాంబాబు బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు గుమ్మడవెల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: