గుండాల ఏప్రిల్ 27(మన్యం మనుగడ) 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా గుండాల సిఐ కరుణాకర్ , ఎస్ ఐ రమణారెడ్డి పట్టుకొని కేసు నమోదు చేశారు, కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలో కొమరారం గ్రామం వద్ద సిఐ కరుణాకర్, ఎస్ ఐ రమణారెడ్డి లు సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీ లో 50 కింటల్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వై రామారావు, ఎస్ కె సలీం, లాలు, దయాకర్ లపై కేసు నమోదు చేసినట్టు వారు పేర్కొన్నారు సెక్షన్ 6ఎ తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు వారు పేర్కొన్నారు
Post A Comment: