CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా ను అందజేసిన పినపాక మండల ఎంపిపి.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక లోని రైతు వేదికలో పినపాక మండల తాహసిల్దార్ విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ విచ్చేశారు. ఈ సందర్భంగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మండలంలోని ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా ను ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతులమీదుగా అందజేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వం సర్వమత సమ్మేళనాన్ని పాటిస్తుందని, హిందూ, ముస్లిం క్రైస్తవులు అనే తేడా లేకుండా, వారి వారి పర్వదినాలను పురస్కరించుకుని సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు,మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, కో ఆప్షన్ సభ్యులు జహంగీర్, రెవిన్యూ సిబ్బంది, మండలానికి చెందిన ముస్లిం మహిళలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: