మన్యం మనుగడ, మంగపేట.
రబీ ధాన్యం కొనుగోలు విషయం లో కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తే రైతు వ్యతిరేక ప్రభుత్వం లా కన్పిస్తుంది, రైతుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ లో ఉండదు అని రైతులకు మద్దతుగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆధ్వర్యంలో మంగపేట మండల కేంద్రం లో రైతు దీక్షలు ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు విషయం లో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుంది, కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని, భే షరతుగా యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని లేదంటే రైతుల ఆగ్రహానికి గురి కాక తప్పదని మండి పడ్డారు. వెంటనే తెలంగాణా వ్యాప్తంగా ఉన్న యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Post A Comment: