మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన కొమరం హనుమంతయ్య (70) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి హనుమంతయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చందా హరిక్రిష్ణ, పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పడగల సత్తిష్ రెడ్డి, సీనియర్ నాయకయులు వట్టం రాంబాబు, రేగా సత్యనారాయణ, బుడగం రాము,కొంపెల్లి పెద్ద రామలింగం, సార.సాంబయ్య,కనకయ్య, పాల్గొన్నారు.
Post A Comment: