మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.ఆస్పత్రిలో పలు రకాల సమస్యలతో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.డాక్టర్లు అందిస్తున్న వైద్యసేవలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైద్యసేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగు పడ్డాయని,ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించడంతో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు,టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,మణుగూరు పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు సిద్దేల. తిరుమలరావు,డాక్టర్ దేవేందర్,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: