మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: తిప్పనపల్లి గ్రామంలో కోదండ రామాలయం నిర్మాణ ముహూర్తం ఖరారు చేసినట్లు వేదపండితులు వి వి ఆర్ కె మూర్తి, గ్రామ పెద్ద తాళ్లూరి వెంకటేశ్వరరావులు సంయుక్తంగా ప్రకటించారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన గ్రామస్తుల, ఆలయ కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో వీరిరువురు ప్రసంగించారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు, భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈనెల 16న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన పూజ చేయటం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, కోదండ రామాలయ కమిటీ బాధ్యులు లంక నరసింహారావు, ధరావత్ రామారావు, రామిశెట్టి సైదయ్య, చావా రామకోటయ్య, పసుపులేటి మంగయ్య, గుగులోత్ రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: