గుండాల/ఆళ్లపల్లి ఏప్రిల్ 22 (మన్యం మనుగడ) మన ఊరు మన బడి కార్యక్రమం తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారనున్నాయి అని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఈ పథకం కింద 14 లక్షల రూపాయలతో ఆధునిక రించ బడి ఉంది అని అన్నారు. అధికారులు పనులు చేస్తారు లే అనకుండా గ్రామస్తులు స్థానిక ప్రజా ప్రతినిధులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నాణ్యంగా పనులు చేయించుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలోని అందరి తో కలిపి కమిటీ వేశారని ఆ కమిటీ పర్యవేక్షణలో పనులు నాణ్యంగా చేయించుకోవాలని ఆయన ప్రతిసారి నిధులు విడుదల కావని వచ్చినప్పుడే పకడ్బందీగా పనులు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజుభార్గవి, తాసిల్దార్ నదియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, గ్రామస్తులు గౌరిశెట్టి శ్రీనివాస్, అధికారులు ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: