మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: వేసవితాపం నుండి పక్షులను కాపాడాలని అటవీశాఖ రేంజర్ శ్రీనివాసరావు మండల ప్రజలకు సూచించారు. సోమవారం చండ్రుగొండ పంచాయతీలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వేసవిలో పక్షుల కోసం ఇంటి ఆవరణలో మూతలలో, మట్టి మూతలలో నీటిని ఉంచేలా ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేసవిలో బయట నీరు దొరకడం కష్టంగా ఉందని, ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో పక్షుల కోసం, వాటిని వేసవి తాపం నుండి రక్షించేందుకు నీటిని ఏర్పాటు చేయాలన్నారు. అందరూ ఇలా చేయడం వల్ల పక్షులను కాపాడినవాళ్ళమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: