మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ. కొత్త గూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 20 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి ఉమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీశ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దినసరపు శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
Post A Comment: