మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని రాజుపేట -లక్ష్మి నర్సాపురం లోని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రమణక్కపేటకు చెందిన నిరుపేద యువకుకి (ఆటో డ్రైవర్ )ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు నవీన్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం ఆర్ధిక సహాయం అందించి త్వరగా కోరుకోవాలని, అందుకోసం డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటూ మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు బాడిశ నాగ రమేష్ మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం అందించాము, ఇంకా అందిస్తూనే ఉన్నాం, ఇంకా ఎక్కువగా మానవ సేవలో తరించాలని అందుకు దేవుడు శక్తిని ప్రసాధించాలని కోరుతున్నాం ఎందుకంటే మానవసేవే మాధవ సేవ అని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు బాడిశ నాగరమేష్, బాడిశ నవీన్, కొమరం మాధవరావు,ఇర్ప నాగశ్రవణ్, కొమరం నితిన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: