మన్యం మనుగడ వాజేడు.
ఈరోజు వాజేడు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కందుల రామ్ కిషోర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మండల అధ్యక్షులు రామ్ కిషోర్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు పొలుసాని సునీల్ రావు. భూపాలపల్లి జిల్లా దళిత జిల్లా ఇంచార్జి జాడీ వెంకట్ హాజరై వారి అధ్వరలో ఇరవై కుటుంబాలు బీజేపీ లో జాయిన్ అయ్యారు వారికి రాష్ట్ర నాయకులు సునీల్ కండువా కప్పి పార్టలోకి స్వాగతించారు. సీనియర్ నాయకులు యాలం సుబ్బయ్య, సాగి సీతారామ రాజు, మండల ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన రవీందర్, బడే షణ్ముక రావు, మండల ఉపాధ్యక్షులు నాగరాజు, శివ, యువమోర్ఛా అధ్యక్షులు జగపతిబాబు, కిసాన్ మోర్చా అధ్యక్షులు నవీన్, మహిళా మోర్చా అధ్యక్షులు బొల్లె పార్వతి, పెద్ది హరిణి, తిరుపతమ్మ, స్వప్న, రాజేశ్వరి, నాగమణి, ప్రమీల, సోషల్ మీడియా కన్వీనర్ వెంకటేష్, వినోద్, నవీన్, వెంకటేశ్వర్లు, ప్రమోద్, మురళి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: