గుండాల /ఆళ్లపల్లి ఏప్రిల్ 7(మన్యం మనుగడ) మండలం పరిధిలోని పెద్ద వెంకటాపురం టిఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ వజ్జా నరసింహారావు ప్రభుత్వ ఆసుపత్రి, యూనియన్ బ్యాంక్, బస్టాండ్ కూడలి వద్ద ప్రజల సౌకర్యార్థం కూర్చునేందుకు బెంచీల ను ఏర్పాటు చేశారు. నిత్యం ఈ ప్రదేశాల్లో ప్రజలు పెద్ద మొత్తంలో ఉంటున్నారని వారు కూర్చునేందుకు ఎటువంటి సౌకర్యాలు లేనందున తాను చెల్లించి బెంచీలు విస్తరణ చేసినట్టు సర్పంచ్ నరసింహారావు పేర్కొన్నారు. ప్రజా సేవ చేసేందుకే ప్రజలు తమకు పదవులను ఇచ్చారని వారికి సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సజ్జ సుజాత, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: