మన్యం మనుగడ, అశ్వారావుపేట:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావుల ఆదేశాల మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు గారి పిలుపు మేరకు అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో తెలంగాణ యాసంగి వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, మోడీ దిష్టి బొమ్మను శవయాత్ర చేసి, దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నల్ల జెండాలతో నిరసన ర్యాలీ కార్యక్రమం మరియు ప్రతి రైతు ఇంటి పై నల్ల జెండాలను కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారం రాజశేఖర్, గ్రామ కమిటీ టిఆర్ స్ పార్టీ అధ్యక్షులు గందమనేని రమేష్, విద్యార్థి విభాగం అధ్యక్షులు మడివి ధర్మరాజు, టిఆర్ స్ పార్టీ నాయకులు రామకృష్ణ రాజు, సున్నం కృష్ణ, చిన్న, ఆకాష్ రావు, మొడియం దుర్గారావు, వెంకన్నబాబు, నారం కిషోర్, సుబ్బారాజు, బీమరాజు, తుట్టి శ్రీను, లింగయ్య, చల్మారావు, పెద్ద ఎత్తున్న టిఆర్ స్ కార్యకర్తలు, యువత, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: