మన్యం మనుగడ, మంగపేట.
శనివారం నాడు మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్ ఆధ్వర్యంలో రమణక్క పేట, గ్రామానికి చెందిన రిపోర్టర్ జానపట్ల జయరాజ్ ఇటీవల బైక్ ప్రమాదానికి గురైన విషయాన్ని తెలుసుకొని అతడిని పరామర్శించి 2500రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
రాజుపేట గ్రామానికి చెందిన మండల సమాఖ్య సీసీ సోలిపురం సత్యనారాయణ చుంచుపెళ్లి వద్ద ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదం లో గాయపడ్డ విషయం తెలుసు కొని అతడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మనోధైర్యం కల్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషా, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా, యువ మోర్చా జిల్లా కార్యదర్శి బొంబోతుల మురళి, గిరిజన మోర్చా వనబంధు జిల్లా కన్వీనర్ భూక్య రతన్ సింగ్,కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు దంతేనపెళ్ళి నరేందర్,జిల్లా నాయకులు మల్ రెడ్డి సుధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు అబ్బెరబోయిన లక్ష్మన్, గిరిజన మోర్చ మండల అధ్యక్షుడు కల్తీ రామకృష్ణ, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు ఇందారపు ప్రతాప్, మండల కార్యదర్శి బట్ట సాంబశివరావు, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కొత్నాల కుమార్, తిమ్మంపేట బూత్ అధ్యక్షుడు వేల్పుల తిరుపతయ్య, నాయకులు మునిగాల సాయి, అవుల సతీశ్, అక్కినేని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: