మన్యం మనుగడ కరకగూడెం: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వీధివీధినా గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కే.చంద్రశేఖర రావు ,ప్రభుత్వ విప్,పినపాక శాసన సభ్యులు,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గార్ల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 27వ ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన నేతలకు సూచించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని 27న గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు కొంపెల్లి పెద్ద రామలింగం,నేతాజీ,జాడి రామనాథం,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు పాయం నర్సింహారావు,సర్పంచులు బత్తిని నర్సింహారావు,కొమరం విశ్వనాధం,పోలెబోయిన పాపక్క,తోలెం సావిత్రి-సారయ్య,మండల యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,ఉప్పలరెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు పోలెబోయిన నాగభూషణం,కుంజ నాగేంద్ర బాబు,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: