మన్యం టీవీ మణుగూరు:
నాగరాజు మృతి మణుగూరు ఏరియా కాంట్రాక్టు కార్మిక ఉద్యమానికి తీరని లోటని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం రాజుపేట గ్రామంలో వారి స్వగృహంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, వారి భౌతిక కాయంపై అరుణ పతాకం కప్పి,వారి మృతికి సంతాపం ప్రకటించి,జోహార్లు అర్పించారు.వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010 సంవత్సరంలో మణుగూరు లో గ్లోబల్ కోల్ వాషర్ ప్లాంటు ప్రారంభమైనప్పుడు ఐ.ఎఫ్.టి.యు యూనియన్ తరపున గ్లోబల్ కోల్ వాషర్ ప్లాంట్లో సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరాడని అన్నారు. అనారోగ్యం తో 29.4.2022 తారీఖున ఖమ్మం హాస్పిటల్ లో మరణించడం జరిగింది అన్నారు.ఇతని వయస్సు 30 సంవత్సరాలు అని,అతి చిన్న వయసులో మరణించడం బాధాకరం అన్నారు.అతను విధుల్లో చేరినప్పటి నుండి కంపెనీలో తన విధులు నిర్వహిస్తూనే,కార్మికుల సమస్యలపై,ప్రజా సమస్యలపై యూనియన్ నిర్వహించే అన్ని ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు అన్నారు.అతని మరణం మణుగూరు ఏరియా కార్మిక ఉద్యమానికి లోటు అన్నారు.అతనికి భార్య లక్ష్మి 25 సంవత్సరాలు,ఒక పాప,ఒక బాబు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అన్నారు.అతని మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది అని తెలిపారు. వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని గ్లోబల్ యాజమాన్యం వారి కుటుంబానికి ఆర్థికంగా సహకరించి,కంపెనీలో అతని భార్యకు ఉపాధి కల్పించి,వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్లోబల్ యాజమాన్యాన్ని వారు కోరారు.కార్మికులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమం లో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచి కార్యదర్శి ఎండీ.గౌస్, ఉపాధ్యక్షులు సంజీవ రెడ్డి, నాయకులు చారి,సమ్మన్న, జంపన్న,ప్రవీణ్,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: