మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని కౌలురు గ్రామంలో వివాహిత మహిళల పై బలవంతంగా అత్యాచారం చెయబోయిన వ్యక్తి పై కేసు నమోదు అయిన సంఘటన చోటుచేసుకుంది. దినికి సంబంధించి కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మండల పరిధిలోని కౌలురు గ్రామానికి చెందిన రామగాని సందీప్ అనె వ్యక్తి అదె గ్రామనికి చెందిన గిరిజన వివాహిత మహిళను ఈ నెల 2 వ తేదీన అమె ఇంట్లో ఎవ్వరు లెని సమయంలో బలవంతంగా అత్యాచారం చేయబోయాడు ఈ క్రమంలో సదరు మహిళల కేకలు వెయ్యడంతో సందీప్ అనె వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు.ఈ విషయం సదరు మహిళల బుధవారం కరకగూడెం పోలిస్ స్టేషను లో పిర్యాదు చెయ్యగా మహిళల పిర్యాదు మేరకు సందీప్ అనే వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.అలాగే ఈ కేసు ను మణుగూరు ఏఏస్పీ శబరీష్ విచారిస్తున్నట్లు తెలిపారు.
Post A Comment: