గుండాల ఏప్రిల్ 7 (మన్యం మనుగడ) అమరవీరుల వర్ధంతి సభలను ఘనంగా నిర్వహిస్తున్నామని పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు ఇర్ప రాజేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పెరిగిపోయిన మతోన్మాదానికి దుర్మార్గపు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి తన విలువైన ప్రాణాలను అర్పించాడు అని అన్నారు. జార్జిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాని, సూర్యనారాయణ, ప్రణీత, రవళి, శ్రీవిద్య, వైష్ణవి, భార్గవి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: