మన్యం టీవీ మణుగూరు:
ఆదివారం జరిగే మే డే 136వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని,బైక్ ర్యాలీ నీ జయప్రదం చేయాలని,ఏ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ,పిలుపునిచ్చారు.శుక్రవారం కార్యాలయంలో మే డే గోడ పత్రికను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,136వ మే డే జెండా ఆవిష్కరణ వాడవాడలా,కార్మిక వీధుల్లో కంపెనీలలో,బొగ్గు బావుల్లో అన్నిచోట్ల జెండా ఎగురవేయాలని,దీంతోపాటు మండలంలో బైక్ ర్యాలీ లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు ఎస్కే. సర్వర్,దుర్గ్యాల సుధాకర్ ఏఐటియుసి మండల అధ్యక్ష కార్యదర్శులు తోట రమేష్, అక్కి నరసింహారావు నాయకులు,కొండలరావు కె వి నారాయణ,హోమర్,రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: