మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అట్టం రమ్య చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపిపి జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచ్ అట్టం రమ్య, పంచాయితీ కార్యదర్శి హరికృష్ణ లు రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్న సందర్భంగా, పాదచారులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు సౌకర్యం కొరకు వారి దాహార్తిని తీర్చడం మంచి కార్యాక్రమమని, చలివేంద్రం ప్రజలకు అందిస్తున్న మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: