దమ్మపేట ఏప్రిల్ 09 ( మన్యం మనుగడ ) : పెంచిన ఆర్టీసీ చార్జీలను.తగ్గించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ఈ సందర్భంగా యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కలిసి డ్రామాలు ఆడుతున్నాయని విపరీతంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని రాష్ట్రంలో కేసీఆర్ వడ్ల రాజకీయంతో నిత్యావసర వస్తువుల రేట్లను కరెంటు ఛార్జీలను ఆర్టీసీ చార్జీలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని రెండు ప్రభుత్వాలకి కాలం చెల్లిందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పండూరు వీరబాబు బత్తుల సాయి ధర్మ వెంకటేష్ జాను నక్క నాగమణి గాజుభోయిన కృష్ణవేణి వెంకటేష్ జన్ బి బెల్లం కృష్ణవేణి ప్రసాదు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: