దమ్మపేట ఏప్రిల్ 09 ( మన్యం మనుగడ ) ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గ వైస్సార్ తెలంగాణా పార్టీ సమావేశము దమ్మపేటలో పెనుబల్లి రమేష్ బాబు అద్వర్యంలో మండల నాయకులు పాకనాటి శ్రీనివాసరావు అధ్యక్ష్యతన కార్యకర్తల సమావేశము జరిగింది. ఈసమావేశానికి జిల్లా అధ్యక్షులు నరాల సత్యనారాయణ ముఖ్యతిదిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో షర్మిలక్క ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతం చేయాలని కోరడం జరిగింది. భారీ జన సమీకరానతో ర్యాలీగా వెళ్లి వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈకార్యక్రమములో మహిళ అధ్యక్షులు జానబీ ఫిరోజ్ , కందుకూరి రాంబాబు , కూరపాటి నరేష్ చెక్రాల శ్రీను పాకనాటి శ్రీను శ్రీరాముల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: