మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల గూడెం గ్రామానికి చెందిన కట్టం నాగేశ్వరరావు (48) సంవత్సరాలు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి మరణించడంతో అశ్వాపురం మండలం ప్రభుత్వ ఆసుపత్రి నందు విషయం తెలుసుకొని వారి పార్ధివ దేహాన్ని సందర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్, వైస్ ఎంపీపీ వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, మండల నాయకులు కందుల కృష్ణార్జున రావు, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు అశోక్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపెన శ్రీనివాస్, చింతిరాల సర్పంచ్ పాయం భద్రయ్య, మండల నాయకులు యువజన విభాగం నాయకులు సోషల్ మీడియా సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: