మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మంచి సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని జమాత్ ఇస్లామిక్ హింద్ సంస్థ మండల అధ్యక్షుడు ఎండి షబ్బీర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. శనివారం ఉగాది(శుభకృత్ నామ సంవత్సర) దినాన్ని పురస్కరించుకొని జమాత్ ఇస్లామిక్ హింద్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో హిందువులకు గ్రీటింగ్స్ ను అందజేశారు. అదే విధంగా వేదపండితులు వివిఆర్కె మూర్తి ఆధ్వర్యంలో అత్యంత పెద్ద వయస్సు కలిగిన కురువృద్ధుడు ఇబ్రహీం( 110 సంవత్సరాలు)ను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజంలో అన్ని మతాలు, అన్ని పండుగలను గౌరవించేలా యువత కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లామిక్ హింద్ సంస్థ బాధ్యులు మస్తాన్ సాబ్, మౌలాలి, అన్వర్, రియాజ్ అల్తాఫ్, యాకూబ్, నాగుల్ మీరా,రబ్బాని,భాష తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: