CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

Share it:


మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని 89వ, పోలింగ్ బూత్ లో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిజెపి 1982 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్ పై ఎల్కే అద్వానీ నాయకత్వంలో బిజెపి పార్టీ స్థాపించబడిందని, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ , పండిత్ దీన్ దయాల్ ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ, అట్టడుగున ఉన్న పేద ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందే దిశగా భారతీయ జనతా పార్టీ పని చేస్తుందని, బిజెపిలో కార్యకర్తలందరూ క్రమశిక్షణగా ఒక పద్ధతిగా దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తున్నారని అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు రెండు స్థానాలు ఉన్న పార్టీ ఈ రోజున 303 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని నరేంద్ర మోడీ ప్రధానిగా నీతివంతమైన పాలన ఆదర్శమైన పాలన దేశానికి అందిస్తున్నారని, ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని 14 కోట్లకు పైగా సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీఅని, తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో ప్రజలు బిజెపిని గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్ , కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్ , యల్లంకి వెంకటేశ్వర్లు, యువ మోర్చా మండల అధ్యక్షుడు జేష్ట నరేష్, చిలుకూరి కిరణ్, సిరిపురపు గోపాలరావు, రాంబాబు వందనపు సుబ్బు, కొమ్మినేనినరసింహారావు ,సత్యనారాయణ, పుల్లారావు, సైదారావు, బిజెపి కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: