మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టి. కొత్తగూడెం గ్రామంలో 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సి సి రోడ్డు నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు శుక్రవారం నాడు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన తోపాటు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: