మన్యం మనుగడ, అశ్వారావుపేట:టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు జన్మదిన వేడుకలు అశ్వరావుపేట లో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఆదేశాల మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో జెడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేశారు. అనంతరం అమ్మ సేవాసదన్ లోనే వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నారం రాజశేఖర్, మండల పార్టీ కార్యదర్శి జుజ్జూరు వెంకన్న బాబు, వైస్ ఎంపీపీ చిట్టూరి పనింద్ర, మోటూరి మోహన్, పార్టీ నాయకులు కలపాల శ్రీనివాసరావు, టౌన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్య వరపు సంపూర్ణ, విఎస్ ప్రకాష్ రావు, గ్రామ శాఖ అధ్యక్షులు సిహెచ్ బజార్ యువజన సంఘం నాయకులు తగరం హరికృష్ణ, గంధం ఆనంద్, తగరం శ్రీను చిప్పనపల్లి శ్రీను, నారం నరసింహ రావు, దుర్గారావు, తుట్టి శ్రీను, కుంజా రాముడు, వేదాంతపురం సర్పంచ్ సోమిని ప్రసాద్, ఉప సర్పంచ్ కాళహస్తి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: