మన్యం టీవీ వెబ్ డెస్క్:
ధరణి పోర్టల్ ప్రత్యేక మాడ్యూల్ను తీసుకొచ్చింది. అప్లికేషన్ ఫర్ పాస్ బుక్ డేటా కరెక్షన్ పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త మాడ్యూల్ ద్వారా మొత్తం 8 రకాల సవరణలకు ఆస్కారం ఏర్పడింది.
పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఈ మేరకు ధరణి పోర్టల్లో ప్రత్యేక ఏర్పాటు చేసింది. అప్లికేషన్ ఫర్ పాస్ బుక్ డేటా కరెక్షన్ పేరిట కొత్త మాడ్యూల్ను తీసుకొచ్చింది.
పాసుపుస్తకాల్లో పేరు మార్పు, భూమి స్వభావం,వర్గీకరణ, రకం మార్పు,విస్తీర్ణం సరిచేయడం, మిస్సింగ్ సర్వే - సబ్ డివిజన్ నంబర్లు,నోషనల్ ఖాతాల నుంచి భూమి బదిలీ, భూమి అనుభవంలో మార్పుకు అవకాశం కల్పించారు.
Post A Comment: