మన్యం మనుగడ, మంగపేట.
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డా:ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్,బీఎస్పీ ములుగు జిల్లా ఇంఛార్జీలు శనిగరపు నరేష్ ,మైస సతిష్,జిల్లా అధ్యక్షుడు పరికి పవన్ తేజ ఆదేశాల ప్రకారం మంగపేట మండలం రాజుపేట గ్రామంలో బీఎస్పీ మంగపేట మండల కన్వీనర్లు చప్పిడి వెంకటేశ్వర్లు,గుళ్లగట్టు విజయరావు, ములుగు జిల్లా మీడియా ఇంచార్జీ జై భీమ్ రాంమోహన్ ,జిల్లా మహిళా నాయకురాలు గుంటాపూడి తిరుమల ఆధ్వర్యంలో రైతు సమస్యలపై రైతులతో మాట్లాడడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా
ములుగు అసెంబ్లీ అధ్యక్షులు ఎంపెళ్లి వీరస్వామి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ లో రైతులు పండించే పంటలకు గిట్టు బాటు ధరలేదు,రైతుకూలీల కు కనీస ప్రమాద భీమాలేదు,యాసంగి పంటలు చేతికి వచ్చినా వడ్లు కొనే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని,కౌలు రైతులకు రై తు బంధు,రుణాలు ఇవ్వడం లేదు,అన్ని సమస్యలకు పరిస్కారం DR.RS.ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో,ఏనుగు గుర్తు ధ్వారా SC,ST,BC,మైనారిటీ, అగ్రవర్ణ లలోని బహుజనులందరూ ఏకమై బహుజన రాజ్యాధికారాన్ని సాధించడమే అని తెలియజేశారు.తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించకుంటే BSP పార్టీ దశల వారీగా ఆందోళలు చేపడతారని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు నాగ సమ్మయ్య,జంగం రాయపాల్,జంగం సామేలు, శెట్టిపల్లి శ్రీను,మైపా శ్రీను దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: