గుండాల ఏప్రిల్ 27(మన్యం మనుగడ) ప్రపంచ కార్మిక వర్గ పోరాట దీక్ష ఈ రోజైనా మేడే పోస్టర్ను న్యూ డెమోక్రసీ నాయకులు వై వెంకన్న కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆయన అన్నారు. కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేయటం కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. కార్మికులంతా ఒక్కతాటి మీద నిలబడి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమాలి యూనియన్ నాయకులు గడ్డం నాగేశ్వరరావు, బాల్య కిరణ్, చేయబోతు రవి, ప్రసాద్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: