- సింగరేణి పాఠశాల కీ చెందిన విద్యార్థి బస్సుకు వేలాడుతూ ప్రయాణం
మన్యం మనుగడ, మణుగూరు: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం. విద్యార్థి పాఠశాలకి ఆలస్యం అయింది అన్న కారణంతో బస్సుకు వేలాడుతూ ప్రయాణించాడు. వివరాలు ఎలా ఉన్నాయి. రోజువారి లానే సోమవారం ఉదయం ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమై ఉన్నాడు. ఈ క్రమంలో పాఠశాల బస్సు ని ఎక్కడానికి ఆలస్యమైన క్రమంలో మణుగూరు సింగరేణి పాఠశాల కీ చెందిన విద్యార్థి జీ.ఎం ఆఫీస్ కీ కూతవేటు దూరంలో ఇలా బస్ నీ వేలాడుతూ ప్రయాణించాడు. ఈ రోడ్డు నిత్యం బొగ్గు లారీలతో రద్దిగా ఉండే ప్రాంతం తోటి పిల్లలు అద్దాం లో నుంచి వెనుక వేలాడుతున్న విద్యార్థినీ చుస్తున్న కూడా డ్రైవర్ దీన్ని గమనించకపోవడం గమనర్హం.స్కూల్ యాజమాన్యం దీని పై దృష్టి సరించి తగిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సింగరేణి పాఠశాల మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
Post A Comment: