మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: జగ్జీవన్ రామ్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ప్రధాన సెంటర్లో దళిత సంఘాలు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... బీహార్ రాష్ట్రంలో పుట్టిన జగ్జీవన్ రామ్ ఉన్నత పదవుల్ని అనుభవించి, అణగారిన వర్గాల కోసం ఎనలేని సేవలు చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు,ఆప్పీల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహక అధ్యక్షులు గొళ్ల రమేష్,సీనియర్ టిఆర్ఎస్ నాయకులు గాదె శివప్రసాద్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, నాయకులు వారది సత్యనారాయణ, సాబీర్ హుస్సేన్, రాయి రాజా, దళిత సంఘాల నాయకులు రెడ్డిపోగు సురేష్, చాపలమడుగు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ రావు, రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: