మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలంలో గోవిందాపురం,ములకపాడు,పాత మారేడుబాక గ్రామాలలో పలు అభివృద్ధి పనులను జెడ్ పి టి సి తెల్లం సీతమ్మ ,ఎంపీపీ రేసు లక్ష్మీ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.అలాగే మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా గోవిందాపురం పాఠశాలకు 6లక్షల రూపాయలు,పాత మారేడుబాక గ్రామ పాఠశాలలో 7 లక్షల రూపాయల తో వంటాషెడ్స్,విద్యుత్ ఏర్పాటు,త్రాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు పనులను,ములకపాడు ప్రాధమిక వైద్యశాల లోమాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నిధులు 5లక్షల రూపాయల తో సి సి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మీ, ఎంపీటీసీ తెల్లం భీమరాజు, ములకపాడు సర్పంచ్ కల్లూరి దేవి, ఎంపీటీసీ కొరసా చిలకమ్మ,పాత మారేడుబాక సర్పంచ్ కురసం వీరమ్మ, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, అధికారప్రతినిది ఎండి జానీపాషా,ప్రచార కమిటీ అధ్యక్షుడు దామెర్ల శ్రీనివాస్, కార్యదర్శి కెల్లా శేఖర్,నాయకులు పోడియం సుబ్బారావు, ఐ టి డి ఎ డి ఈ హరీష్ , ఏ ఈ వెంకటేశ్వరరావు , డా. బాలాజీ నాయక్ ,డా. వసుంధర తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: