మన్యం మనుగడ, అశ్వారావుపేట:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి చిరంజీవి అన్నారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో పేరాయిగూడెం లో డిమాండ్ లతో కూడిన ప్లే కార్డులు తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్న పేద, మధ్యతరగతి, కార్మిక వర్గాలపై మోడీ, కెసిఆర్ పోటీ పడి ఆయిల్, కరెంట్,మందుల ధరలు పెంచుతున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలు తగ్గించే వరకు గ్రామాల్లో ప్రజలను సమికరించి ఆందోళన నిర్వహిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుకు తగిన గుణపాఠం చేబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, నిర్మల, జగన్నాథం, రవి, ఏసు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: