మన్యం మనుగడ, మంగపేట.
మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆర్థిక పరమైన ఇబ్బoదులతో మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కప్ప సంతోష్ గతకొంత కాలంగా ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంటి నుంచి పురుగుల మందు తాగి బయటకు వచ్చి స్పృహతప్పి పడిపోగా, కుటుంబసభ్యులు వెంటనే 108 ద్వారా ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా యువకుడు అప్పటికే మృతిచెందాడు.
Post A Comment: