దమ్మపేట ఏప్రిల్ 08 ( మన్యం మనుగడ ) : గండుగులపల్లి ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ పూనెమ్ వీరస్వామిని ఉద్దేశపూర్వకంగా డిప్యూటేషన్ పై బదిలీ చేయటం అన్యాయం అని ఎంతో నిబద్ధతతో వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న అతనిని కొందరు మహిళా ఉద్యోగులు దురుద్దేశంతో ఫిర్యాదు చేసి కావాలనే ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేయించారని దీని వెనుక ఐటిడిఎ అధికారుల హస్తం కూడా ఉంది అని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఐటీడీఏ పీవో కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు కొరసా వెంకటేష్ దొర తెలిపారు ఇదిలా ఉండగా బదిలీపై వెళ్తున్న ప్రిన్సిపాల్ వీరస్వామిని వెళ్లనీయకుండా పాఠశాల విద్యార్థులందరూ కన్నీళ్ల పర్యంతం అయినారు
Navigation
Post A Comment: