మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారంగా ఈరోజు తాటిగూడెం, గాంధీనగర్ గ్రామాల్లో 1,69,500 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీపీ రేగా కాళికా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయనిధి అనేది ఒక వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అకాంక్షిస్తూ హాస్పిటల్ ఖర్చులకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న వారందరికీ సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో తాటిగూడెం సర్పంచ్ కొమరం విశ్వనాధం,ఉపసర్పంచ్ జాడి. నాగరాజు,నాయకులు రేగా సత్యనారాయన,కొంపెల్లి పెద్ద రామలింగం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: