మన్యం మనగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సోమవారం అశ్వాపురం, మణుగూరు, పినపాక , బూర్గంపాడు, మండలాలకు చెందిన చర్చి పాస్టర్ లతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు, త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం చర్చి పాస్టర్ లు రేగా కాంతారావు గారిని శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించడం జరిగింది.
Post A Comment: