మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు ఆదేశాల మేరకు,అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో, ఈరోజు తుమ్మలచేరువు పంచాయతీ రైతువేధికా నందు నల్ల జెండాల తో నిరసన కార్యక్రమం మరియు ఇంటి పై నల్ల జెండాను కడుతున్న తుమ్మలచేరువు ఎమ్ పి టి సి తాటి పూజిత. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో పండిన ప్రతి ఒక్క ధాన్యపు గింజలు కేంద్ర ప్రభుత్వం కొనాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ్ల సంధ్యారాణి,ఉపసర్పంచ్ పాయం కమరాజు,మండల ప్రధాన కార్యదర్శి వంక పూర్ణ,గ్రామ అధ్యక్షుడు వంక పంతులు,నాయకులు వెంకటేశ్వర్లు,గ్రామ ప్రచార కార్యదర్శి గడకారి రామకృష్ణ, పాయం సారయ్య ,బండ్ల కాంతారావు,గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: