మన్యం టివి దుమ్ముగూడెం::
ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకొని ఐ టి సి ఎంఎస్ కె వారు మార్చి 22 నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన పిల్లలకు బుధవారం నాడు బండరుగూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లల్లోని అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీయటానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని స్వచ్ఛంద సేవా సంస్థలకు పిలుపునిచ్చారు. డ్రాయింగ్,వ్యాసరచన,క్విజ్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏ.వీ సీతారాం ,టి వంశీ మోహన్, ఎం. సరోజిని, జీ .రవి తో పాటు ఆయా ఎస్. తిరుపతమ్మ పాల్గొన్నారు.
Post A Comment: