దమ్మపేట ఏప్రిల్ ( 08 ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట
తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య మూడవ మండల మహాసభలో గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో గిరిజనుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని గిరిజన హక్కులను కాలరాస్తూ ఉన్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఎక్కువయ్యాయని ఆదివాసి అడవిబిడ్డల మైన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టి గిరిజనుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని రాబోయే కాలంలో గిరిజనులంతా ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మట్టి కల్పించటం ఖాయమని కెసిఆర్ కి బుద్ధి వచ్చే లాగా చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసినారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పండూరు వీరబాబు ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకులు సుంకు పాక ధర్మ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు బత్తుల సాయి గిరిజన సంఘం కొరస వెంకటేష్ బెల్లం కృష్ణవేణి ప్రసాద్ సత్యం భీముడు రమాదేవి లక్ష్మి శాంతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: